– టపాకాయలు కాల్చడటంతో టెంట్ దగ్ధం
నవతెలంగాణ-భీంగల్
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 7వ రోజు చెరువుల పండగ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురాణిపేట్ గ్రామ పరిసరాలలోని చెన్న చెరువు వద్ద నిర్వహిస్తున్న చెరువు పండగకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు బాణసంచా కాల్చగా.. అవి సమీపంలో కార్యక్రమం నిమిత్తం వేసిన టెంట్పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో తేరుకున్న కార్యకర్తలు మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పినట్లైంది.