నవతెలంగాణ-లక్ష్మీదేవిపల్లి
బీజేపీని ఓడించండి..ఇండియా కూటమిని గెలిపించండి అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య పిలుపునిచ్చారు. బుధవారం బావోజితండా గ్రామ పరిధిలో వాంకుడోత్ అమర్ సింగ్ అధ్యక్షతన సీపీఐ(ఎం) లక్ష్మీదేవిపల్లి మండలం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బీజేపీని ఓడించి, ఇండియా కూటమిని బలపరచాలని కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం రైతులను అణిచి వేయాలని కఠినంగా అనేక నల్ల చట్టాలను తీసుకుని వస్తే ఆ చట్టాలను రద్దు అయ్యేలా మన రైతు సంఘం ద్వారా పొరాటం చేసి సాధించుకున్నాం అని తెలిపారు. భవిష్యత్ కాలంలో మన బతుకులు మారాలంటే బీజేపీని ఓడించాలని, అందుకే మనం ఇండియా కూటమిని బలపరచాలని అందుకే మనం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, పార్టీ మండల కార్యదర్శి నాగేశ్వరరావు, మండల కమిటీ నాయకులు కోబల్, ధరావత్ వెంకన్న, తేజ వెంకన్న కరణం వీరభద్రం, వెంకటేశ్వర్లు, లాకావత్ కుమార్, విజరు, రామ్ కోటి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.