తిరుపతమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం

తిరుపతమ్మనవతెలంగాణ-మధిర
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. జనసేన నాయకులు లగడపాటి శంకర్‌ డిప్యూటీ సీఎంను అమ్మ వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం పెనుగంచిప్రోలులో ఎస్‌.నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మధిర ప్రముఖులు పాల్గొన్నారు.

Spread the love