ప్రతి వార్డులో కోట్ల రూపాయల తో అభివృద్ది

– బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని తొమ్మిది ఏళ్లలో ఊహించని విధంగా హుస్నాబాద్ పట్టణం ప్రతి వార్డులో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణలోని రాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో 9 వార్డ్ ల పట్టణ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని నేడు ఎండా కాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్నామన్నారు.ఒక్క హుస్నాబాద్ పట్టణంలో రూ 59 లక్షలు పెన్షన్ల రూపంలో 8వేల మందికి లబ్ది పొందుతున్నారన్నారు. పట్టణం, గ్రామాల్లో చర్చ జరిగేలా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చొరవ తీసుకొని పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్,కేసీఆర్ కిట్, కేజీ నుండి పీజీ ఉచిత విద్య, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రతి పక్షాలు మన ఎదుగుదల తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నయని అన్నారు. క్షేత్రస్దాయులో కార్యకర్తలను సమన్వయం కోసమే అత్మీయ సమ్మేళనాలు చేపట్టేమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న పట్టణ అధ్యక్షుడు అన్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love