అమీర్ నగర్ లో ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ

 నవతెలంగాణ -కమ్మర్ పల్లి

మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కృషితో గ్రామానికి చెందిన యన్. ప్రశాంత్ కు రూ.35వేలు, నడిపి మల్లయ్యకు రూ.45వేలు, పుప్పాల నడిపి గంగారాంకు రూ. 45వేల ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహాయం చెక్కులు మంజూరయ్యాయి.అట్టి చెక్కులను ఆదివారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం గంగారెడ్డి, సర్పంచ్ పుప్పాల గంగాధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మైన్ మాలవత్ ప్రకాష్ ఆధ్వర్యంలో లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధితో  ఎంతోమంది పేదల మెరుగైన వైద్యానికి భరోసా లభిస్తుందన్నారు.బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా ఉండి మరోసారి గెలిపించేలా కృషి చేస్తామన్నారు.
 ఆర్థిక సహాయం చెక్కులు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love