నవతెలంగాణ-తలకొండపల్లి
కల్వకుర్తి మండల పరిధిలోని పంజుగుల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో ప్లేట్లు అందజేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్రెడ్డి కుమార్తె గోలి సాత్విక జన్మదిన సందర్భంగా, గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో లైన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 130 మంది విద్యార్థులకు ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు కల్మిచర్ల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. లైన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, స్పోర్ట్స్ దుస్తులతో పాటుగా అనేక సంస్కృతిక, సాంకేతికత పోటీలను నిర్వహించారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిగుర్లపల్లి శ్రీధర్, మెంబర్షిప్ కమిటీ అధ్యక్షుడు కిషన్ కుమార్, లైన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి సభ్యుడు దారమోని గణేష్, పాఠశాల ప్రధా నోపాధ్యాయులు ఎల్లయ్య గౌడ్, ఉపాధ్యాయులు ఉమాదేవి, తిరుపతమ్మ, కృష్ణయ్య, పాండయ్య, పుష్పలత, భాగ్యమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామ యువకుడు పాలేపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.