నవతెలంగాణ- మిరుదొడ్డి
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయంతో గ్రామస్తులు భోజన మిత్ర కమిటీకి అభినందన తెలిపారు. సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన బొట్ట రాజు కుటుంబాన్ని బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరమర్శించారు. అలాగే వారి కుటుంబానికి చేయూతగా సహాయంకోసం 50 కిలోల బియ్యన్ని అందించరు. బొంపల్లి గ్రామంలో భోజన మిత్ర కమిటీ ఎవరు మరణించిన వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం పట్ల గ్రామస్తులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. యువత ఇలాంటి సేవ చేయడంలో ఎంతో సంతోషంగా ఉందని బహుజన మిత్ర కమిటీ సభ్యులు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామని వారు తీయమత్యం చేశారు. కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు వారి కుటుంబసభ్యులు మరియు గ్రామ పెద్దలు ఉన్నారు.
పేద కుటుంబానికి బియ్యం వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



