పోలింగ్ నాటికి కేంద్రాలు సిద్దం చేయాలి: డీఎల్పీఓ రాజీవ్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట

పోలింగ్ నాటికి కేంద్రాలు సౌకర్యాలతో సిద్దంగా ఉంచాలని డీఎల్పీఓ రాజీవ్ కుమార్ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని అచ్యుతాపురం,పేరాయిగూడెం,అశ్వారావుపేట పంచాయితీలు పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసారు.పోలింగ్ కేంద్రాల్లో మరుగుదొడ్లు,ర్యాంప్ లు,వీల్ చైర్ లు సిద్దంగా ఉంచాలని అన్నారు. ఆయన వెంట అశ్వారావుపేట ఈఓ గజవెళ్ళి హరిక్రిష్ణ,అచ్యుతాపురం,పేరాయిగూడెం కార్యదర్శులు దారబోయిన వెంకటరమణ,కోటమర్తి శ్రీరామమూర్తి లు ఉన్నారు.
Spread the love