అంత్యక్రియలకు అర్థిక సహాయం అందజేత..

– నీరు పేద కుటుంబానికి అదుకోవాలని వెడుకోలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన కలిగోట లక్ష్మి 55 బుధవారం మృతి చెందింది. అమే అంత్యక్రియలకు  ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కూతురు ఏమి చేయ్యలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గ్రామంలో ఉన్న(రజక) చాకలి కుల సంఘాల సభ్యులు చందాలు వేసుకుని లక్ష్మీ అంత్యక్రియలకు సహకరించారు. మృతురలి కూతురు వనజా కు ఉండటానికి ఎమీ లేకపోవడం,పని,బట్టలు దోరికినప్పుడు బట్టలను ఉతుకుతు బతుకు బండి నడిచింది. తండ్రి, తల్లి లేక అనాథగా మిగిలిపోయింది. ప్రస్తుతం తిర్మాన్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాల ఒక చిన్న గుడిసె వేసుకొని జీవిస్తుంది. ఎవరైనా దాతలు ఆమె పరిస్థితిని ముందుకు వచ్చి అర్థిక సహాయం చేసి ఒక నీరు పేద కుటుంబానికి అండగా ఉంటు సహకరించాలని పలువురు వేడుకుంటున్నారు.
Spread the love