బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు..

నవతెలంగాణ- నవీపేట్: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ నాయకులను పోలీసులు సోమవారం ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినాథ్ ఆనంద్, రామకృష్ణ, రాజేందర్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, పుట్ట శ్రీనివాస్ గౌడ్, బండారి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Spread the love