వడ దెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి 

నవతెలంగాణ – ముత్తారం:  ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని  ఉపాధి పనులు నిర్వహిస్తుండగా సార్ల లింగయ్య ( 56 ) పనిచేసి ఇంటికి వస్తున్న క్రమంలో వడదెబ్బతో  అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వచ్చిన సారయ్య కండ్లు తింపుతున్నాయని పడుకున్న ఆయనే కాసేపటికి మృతి చెందాడని భార్య నీలమ్మ తెలిపారు ఈ విషయంపై గ్రామ ప్రజలు మాట్లాడుతూ… ఉపాధిహామీ నిబంధనల ప్రకారం వేసవిలో సరైన ఏర్పాట్లు చేయడం లేదని, ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యం వల్లే లింగయ్య మృతి చెందాడని ఆరోపించారు. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని, గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా మృతునికి కొడుకు కూతురు ఉన్నారు
Spread the love