ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

– మద్నూర్ మండల తహసిల్దార్ ఎండి ముజీబ్
నవతెలంగాణ మద్నూర్: 2024 సాధారణ లోక్ సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని మద్నూర్ మండల తహసిల్దార్ ఎం.డీ ముజీబ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.బుధవారం కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎస్ వి ఈ ఈ పి202 సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రాన్ పార్టిసిపేషన్ ఓటర్ లను చైతన్యం చేస్తూ ఎన్నికలలో ఓటర్ లను భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం లో బాగంగా మద్నూర్ మండల తహసిల్దార్ కార్యాలయం నుండి మద్నూర్ బస్టాండు వరకు 5 కె రన్ లో బాగంగా బస్టాండ్ వద్ద మెయిన్ రోడ్డు మీద మానవహారం తో ఓటు హక్కును వినియోగించుకోవాలనీ నినాదించారు . అక్కడి నుండి మార్కెట్ ఏరియా మీదుగా గాంధీ చౌక్ వెళ్లి అక్కడ మానవహారం చేసిన అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ ఓటర్ లు చైతన్య వంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల ఎం.పి.వో వెంకట నర్సయ్య, ఎలక్షన్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్డావార్ శంకర్, జూనియర్ అసిస్టెంట్ శేఖర్ , రవి, మండలంలోని వివిధ గ్రామాల కార్యదర్శులు, మండల రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love