కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. ఎక్సైజ్‌ సీఐ మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎల్బీనగర్‌లో ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యూటర్న్‌ తీసుకుని రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ సాధిక్‌ అలీ దుర్మరణం పాలయ్యారు. నారాయణగూడ ఎక్సైజ్‌ ఎస్‌ఐ మొహీనుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ సాధిక్‌ అలీ, నారాయణగూడ ఎక్సైజ్‌ ఎస్‌ఐ మొహినుద్దీన్‌ మంగళవారం రాత్రి ఎల్బీనగర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై మలక్‌పేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ పారిపోయాడు. కారు వినూష పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది.

Spread the love