ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌ మృతి

road accidentనవతెలంగాణ – ప్రకాశం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్‌నగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందగా..12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Spread the love