హెచ్ 1 బీ వీసా నమోదు గడువు పొడగింపు

నవతెలంగాణ – హైదరాబాద్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగిసిపోయింది. కానీ మరో మూడు రోజులు అంటే మార్చి 23 నుంచి మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్ సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు ఉత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సి ఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్ సీఐఎస్ వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ-907, ఐ-129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్ లైన్ లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి.

Spread the love