నవతెలంగాణ – జూలపల్లి
జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామంలో సోమవారం రోజున చిరుతల రామాయణం కార్యక్రమానికి విరాళంగా కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్ రూ.5000 రూపాయలు అందజేశారు.అబ్బాపూర్ ఎంపిటిసి దండే వెంకటేశ్వర్లు రూ.1000 రూపాయలు విరాళాలు పంపించగా జూలపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు జెట్టి సతీష్ రామాయణ సభ్యులకు అందించారు.ఈ కార్యక్రమంలో బల్ల సత్తయ్య, కనకట్ల కనకయ్య,బొల్లపల్లి అంతయ్య,గుమ్మడి స్వామి దావర్ల రాజయ్య శంకరయ్య తోటపల్లి ఆంజనేయులు సత్తయ్య కుమార్ సంపత్ రామాయణ సభ్యులు పాల్గొన్నారు.