ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును కారు ఢీకొట్టడంతో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.  ఇక క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love