ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌

నవతెలంగాణ – హైదరాబాద్
షాపింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం  ఫ్లిప్ కార్ట్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుందని ప్రకటన జారీ చేసింది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభిస్తాయని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని తెలిపింది. ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది. ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకు క్రెడిట్‌/డెబిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌ ఎలైట్‌ కార్డ్‌పై సూపర్‌ కాయిన్స్‌ లభించనున్నాయి. క్రేజీ డీల్స్‌ పేరున అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఫోర్‌ అవర్‌ డీల్స్‌ సేల్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

Spread the love