– వినతులను స్వీకరించిన అధికారులు
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 46 విజ్ఞాపన పత్రాలు అందాయి. ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పున్నం సత్యనారాయణ, కమిషనర్ కోండ్ర నరసింహ, ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి యరపతినేని శ్రీనివాసరావు, వైద్యాధికారి రామిశెట్టి అవినాష్, విద్యుత్ శాఖ ఏఈ ఉబ్బన శరత్ బాబు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సత్తుపల్లి ప్రజావాణిలో ‘అర్జీల’ వెల్లువ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



