ధరణి పోతే.. దొరల భూములే పోతాయి.. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి

– పోతంగల్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ

నవతెలంగాణ- నవీపేట్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారని సీఎం కేసీఆర్ చెప్పుతున్నారని ధరణి తొలగిస్తే దొరల భూములే పోతాయని అన్నారు. మండలంలోని పోతంగల్ గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సందర్భంగా భాజా భజంత్రీలతో భారీ ర్యాలీ చేసి గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వియ్యంకుడి గ్రామంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కోడలు కవిత ఉన్న ఏమీ చేయకపోవడం గ్రామస్తుల దౌర్భాగ్యం అని అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిలో పావల శాతం కూడా చేయకుండా గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఈ దరిద్రపు పాలనకు అంతం పలికి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతోనే పేద ప్రజల సంక్షేమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బాబు, బాల్రాజ్ గౌడ్, బేకరీ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love