గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్.. 

–  600 గ్రాముల గంజాయి పట్టివేత
నవతెలంగాణ – భీంగల్
మండలంలోని బడా భీంగల్ గ్రామ పరిసరాలలో గల ఎల్లమ్మ గుడి వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై హరిబాబు తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ వెంకటేశ్వర్లతో కలిసి ఎస్సై వెల్లడించిన వివరాలు  ఇలా ఉన్నాయి. ఎన్నికల  కోడ్ లో భాగంగా సి పి సత్యనారాయణ ఆదేశాల మేరకు మంగళవారం  సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బడా భీంగల్ పరిసర ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా నిజామాబాద్  ముస్తాక్ పుర కు చెందిన షేక్ షాదాబ్ , డిచ్ పల్లి మండలం సుద్దా పల్లి, గ్రామానికి చెందిన మేకల రమేష్ గాంధీనగర్ కు చెందిన సయ్యద్ హుస్సేన్, ధర్పల్లి మండలం  దుబ్బాక  కు చెందిన  పిప్పెర  రాజేష్ 600 గ్రాముల గంజాయితో  పట్టుకున్నామని వారి వద్ద గల నాలుగు సెల్ ఫోన్లు TS16 EU 9578 నెంబర్ గల హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైకును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా నిజామాబాద్ కు చెందిన యునూస్ వద్ద కొనుగోలు  చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు నిందితులు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు  లో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్  రాజ్ కుమార్ రంజిత్ దయానంద్ గంగాధర్ లను సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు

Spread the love