ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నవతెలంగాణ  – జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏపీ 29జి 5553 నంబర్ గల స్కార్పియో వాహనం కర్నూలు వైపు నుండి హైదరాబాద్ వెళుతుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఒక బాలుడు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు హుటాహుటిన అంబులెన్స్‌లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా వెళుతూ ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. స్కార్పియో వాహనంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. నలుగురు స్పాట్ డెడ్ కాగా మిగతా ముగ్గురిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Spread the love