సెల్‌ఫోన్‌ షార్ట్‌సర్క్యూట్‌.. ఒకే ఇంట్లో నలుగురు చిన్నారుల మృతి

నవతెలంగాణ ఉత్తర ప్రదేశ్: సెల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ  పెను విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు బెడ్‌షీట్‌కు అంటుకున్నట్టు మృతి చెందిన చిన్నారుల తండ్రి జానీ తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. మృతులను సారిక (10), నిహారిక (8), శంకర్‌ (6), కలు(4)గా గుర్తించారు. కూలీ పనిచేస్తున్న జానీ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడగా.. అతడి భార్య బబితకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love