ప్రియుడిని క‌ట్టేసి ప్రియురాలిపై స్నేహితుడు అఘాయిత్యం

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని తిరుప‌తి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రియుడిని క‌ట్టేసి ప్రియురాలిపై స్నేహితుడు అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. సూళ్లూరు పేట మండ‌ల ప‌రిధిలోని దామ‌రాయ గ్రామ ప‌రిస‌రాల్లో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు, యువ‌తి ఓ ప్రయివేటు సంస్థ‌లో ప‌నిచేస్తూ, స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఆ యువ‌కుడికి ఏడుమలై, బాలాజీ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆ యువ‌కుడు, ఏడుమ‌లై సూళ్లూరుపేట‌లో మ‌ద్యం సేవించారు. ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చేశారు. ఏడుమ‌లై మ‌ళ్లీ రాత్రి ఆ యువ‌కుడికి ఫోన్ చేసి నీ ప్రేయ‌సి బ‌ర్త్‌డే క‌దా.. ఆమెను తీసుకుని కొరిడి శివాల‌యం వెళ్దామ‌ని చెప్పాడు. అది న‌మ్మిన ఆ యువ‌కుడు కంపెనీలో ప‌నికి వెళ్లిన ప్రియురాలి కోసం సూళ్లూరుపేటలోని వైజంక్ష‌న్ వ‌ద్ద వేచి ఉండ‌గా ఏడుమ‌లై, బాలాజీ వ‌చ్చారు. కొంత‌సేప‌టికి యువ‌తి రావ‌డంతో వారంద‌రూ క‌లిసి శివాల‌యానికి బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలో పులికాట్ తీరంలోని దామ‌రాయ ప‌రిస‌రాల్లోకి వెళ్ల‌గా ఏడుమ‌లై, బాలాజీ క‌లిసి ఆ యువ‌కుడి చొక్కా విప్పి, దాంతోనే అత‌డిని క‌ట్టేశారు. ఆ త‌ర్వాత ఏడుమ‌లై ఆ యువ‌తిని బెదిరించి లైంగాకదాడికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం వారి వ‌ద్ద నుంచి మొబైల్ ఫోన్‌, న‌గ‌దు లాక్కుని అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఎలాగోలా అక్క‌డి నుంచి ఇంటికి చేరుకున్న బాధితులు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిగిన విష‌యం చెప్పారు. దాంతో వారు శ్రీహ‌రికోట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Spread the love