– విద్యార్థినిలను అభినందించిన అధ్యాపక బృందం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌర విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు మెరుగైన ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఐలేని నందిని ప్రియ బి పి సి సెకండ్ ఇయర్ 978 ,విలాసాగరం కావ్య 973 లో మార్కులతో కళాశాల ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఐశ్వర్య బి పీ సి సెకండ్ ఇయర్ లో 958 ,అభినయ 909 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించారు. హెచ్ ఈ సి సెకండ్ ఇయర్ లో దొంతర వేణి హరిప్రియ 884 ఫస్ట్ ర్యాంక్, సీఈ సి సెకండ్ ఇయర్ లో ఎం లహరిక 862 సెకండ్ ర్యాంక్, కీర్తన 844 మార్కులతో సెకండ్ ర్యాంకు సాధించింది. ఎంపీసీ లో ఫస్ట్ ఇయర్ శ్రీ నిత్య 461 , సావుల శ్రీజ 455 ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సిఈసి అర్చన 451 ఫస్ట్ ర్యాంక్, బిపిసి ఫస్ట్ ఇయర్ గీకురు మౌనిక 395 ఫస్ట్ ర్యాంక్, బొమ్మగాని అక్షయ 455 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించారు.
విద్యార్థులను అభినందించిన అధ్యాపక బృందం
ప్రభుత్వ బాలికల కళాశాలలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినిలను కళాశాల ప్రిన్సిపల్ డి రవీందర్ , అధ్యాపక బృందం అభినందించారు.