గొసంగి యువజన సంఘం (జి.వై.ఎస్)

– జిల్లా అధ్యక్షులుగా ఈర్నాల వినోద్ కుమార్
– జిల్లా ప్రధానకార్యదర్శిగా పత్రీ సాయికుమార్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పట్టణంలోని కంఠెశ్వర్ బైపాస్ రోడ్డు లో గల గొసంగి కుల సంఘ భవనంలో గొసంగి యువజన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన సీనియర్ న్యాయవాది, సామజిక ఉద్యమకారులు అడ్లురి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అన్నీ రంగాల్లో గొసంగిలు ఎదుగుతూన్నారని రాబోయే రోజుల్లో గొసంగిలు మరింత ఎదగాలని అన్నారు. రాజకీయాల్లో గొసంగి యువత పాత్ర పెరగాలని అన్నారు.అనంతరం గొసంగి యువజన సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా ఈర్నాల వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఈర్నల గంగా రాజేశ్వర్, రేవల్లి సాయిలు, ప్రధానకార్యదర్శి పత్రీ సాయికుమార్, కోశాధికారిగా విభూది అనిల్. కార్యనిర్వహణ కార్యదర్శి గంధం సత్య. సహాయ కార్యదర్శులుగా గంధం భాస్కర్, రాసుల రాజు, ఈర్నాల పెంటన్న, కళ్లెం కిషన్. ప్రచార కార్యదర్శిగా కళ్లేం ఒడ్డెన్న. సంయుక్త కార్యదర్శులుగా ఈర్నాల శ్రీకాంత్, కర్రే శేఖర్, కొండపల్లి గంగాశంకర్ ఎక్సుక్యూటివ్ మెంబెర్లుగా పత్రీ రమేష్, ఈర్నాల సాయికుమార్,డొక్క నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గొసంగి అధ్యక్షులు గంధం రాజేష్, ఎస్సి ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరగొంఢ బుచ్చన్న, ఈర్నాల లక్ష్మన్, గంధం బుద్ది రాజు, పెద్ధ సంఖ్యలో గొసంగి యువత పాల్గొన్నారు.

Spread the love