నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా కార్యక్రమంతో పాటు జిల్లా రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ భద్రాచలానికి వెళ్లనున్నారు. ఈ మేరకు రాజ్భవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఆమె రైలులో బయల్దేరనున్నారు.
బుధవారం తెల్లవారు జామున ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ చేరుకుంటారు. భద్రాచలంలో కార్యక్రమాల అనంతరం ఆమె ఖమ్మం వెళ్లి అదే రోజు మధ్యాహ్నం అక్కడి శ్రీచైతన్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ (గతంలో కిట్స్, ఖమ్మం)లో జరిగే వై20 వర్క్ షాప్లో పాల్గొంటారు. గవర్నర్ వెంట రాజ్ భవన్ అధికారులు కూడా వెళ్లనున్నారు.