నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
మాజీ శాసనసభ్యులు, టిపిసిసి సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలను జరుపు కున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.అనంతరం చీటాకోడూర్ పిఎసిఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, జిల్లా నాయకులు జిల్లెల సిద్ధారెడ్డి, కి సాన్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మోటే శ్రీనివాస్, నాయ కులు లింగాల నర్సిరెడ్డి, ఆలేటి సిద్దరాములు, నల్లగోని బాలకిషన్ గౌడ్, బొట్ల నర్సింగరావు మాట్లాడుతూ భారత దేశానికి ప్రధానిగా పనిచేసిన నెహ్రూ దేశాన్ని బ్రిటిష్ క బంధహస్తాల నుంచి విడిపించడంలో కీలకపాత్ర పోషిం చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రా ష్ట్ర కోఆర్డినేటర్ చిన్నోజు విజయలక్ష్మి, దాసరి శేఖర్, పిట్టల సతీష్, ఆకుల లక్ష్మయ్య, బండారు శ్రీనివాస్, ఎండి గౌస్, కడారి ప్రవీణ్, తాటి కనుక స్వామి, దేవునూరి చంద్రయ్య, లింగాల వెంకటరామిరెడ్డి, కర్ణాకర్ పాల్గొన్నారు.
ములుగు : నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీ తక్క ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సీతక్క అన్నా రు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనీల్, మార్క విజరు కు మార్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేంద ర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్రమౌళి, నల్లెల భరత్ కుమార్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తిరెడ్డి,జిల్లా నా యకులు చింత నిప్పుల భిక్షపతి,ఎంపీటీసీ మవురపు తిరు పతిరెడ్డి, తక్కల్ల పెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వ ర్గీయ మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి కార్యక్రమం ఘ నంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వ రరావు, పోలెపాక నాగరాజు, అయూబ్ ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ చందు, ఎంపీటీసీ ధరావత్ బా లు నాయక్, కీర్తి సురేందర్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, తరాల సుధాకర్, పరాంకుశం శ్రీహరి, సామ సుధాకర్, వాంకు డోత్ బీలియా తదితరులు పాల్గొన్నారు.
గార్ల : మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి వేడుక లను శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు, ముల్కనూ రు ఎంపిటిసి మాళోత్ వెంకట్లాల్లు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టి.కృష్ణ గౌడ్, చషంషాద్ బేగం, సుందర్, నవీన్, రాము తదితరులు ఉన్నారు.