జక్రాన్ పల్లిలో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి అన్నదానం

నవతెలంగాణ –  జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love