ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు

– సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, పదవ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ కోసం వివిధ దశల్లో సాగిన పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, అవమానా లను, అధిగమించిన అడ్డంకులను యాది చేసుకు న్నారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటి స్తూ, వేలాది సభల ను నిర్వహిస్తూ, సబ్బండ వృత్తు లను సకల జనులను సమీకరిస్తూ, సమన్వయ పరుస్తూ, అందరి భాగస్వామ్యం సహకారంతో, శాంతియుత పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, ఈ క్రమంలో సహకరించిన వారినంద రినీ సీఎం గుర్తు చేసుకున్నారు. విజయతీరాలకు చేరుకున్న ఈ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో ఇమి డివున్న.. నిర్థిష్ట పరిస్థితులకు అనుసరించిన నిర్థిష్ట కార్యాచరణను,’బోధించు సమీకరించు పోరాడు’ అనే పంథా ద్వారా సాధించిన విజయాన్ని సీఎం కేసీఆర్‌ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు.
తొమ్మిదేండ్ల క్రితం 2014 జూన్‌ 2 నాడు భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ,. అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థులు కుయుక్తు లను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుత మని సీఎం అభివర్ణించారు. గతంలో వెనకబాటుకు గురయిన తెలంగాణ నేడు సమస్త రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలవడం పట్ల సిఎం కేసీఆర్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. మున్నెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్‌’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలనీ, అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారనీ, ఈ దిశగా దేశ ప్రజలందరి ఆదరాభి మానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమిదని సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్‌, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహౌ జ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభ వంగా, పండుగ వాతావారణంలో జరుపుకునేందు కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వా దిస్తున్న ఆనందరకర సమయంలో తమ సంతో షాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములై రాష్ట్ర ప్రజలంద రూ వాడ వాడలా సంబురాలను ఘనంగా జరుపు కోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Spread the love