నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లపై నీరు నిలిచింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు. వర్షం కారణంగా మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో చెట్లు విరిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చెట్లను తొలగించారు.