నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్బీ, కూకట్పల్లి, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, బోరబండ, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, మైత్రీవనం, అమీర్పేట, పంజాగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, దిల్షుక్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, ముషీరాబాద్ , నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.