పట్టణంలో హోమియోకేర్ ఆస్పత్రి ప్రారంభం..

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని డాక్టర్ దివ్య హోమియో కేర్ ఆస్పత్రి విద్యా నగర్ కాలనీ లో స్మైల్ స్కూల్ బిల్డింగ్ నందు మన విద్యా నగర్ కాలనీ కౌన్సిలర్ నర్సింహ రెడ్డి చేతులమీదుగా గురువారం ప్రారంభించ బడింది. హాస్పిటల్ ప్రతి ఆదివారం మాత్రమే విజిటింగ్ ఉంటుందని డాక్టర్. దివ్య, డాక్టర్. హరీష్ తెలిపారు. ఇట్టి కార్యక్రమం కాలనీ అధ్యక్షులు శ్రీ సాయన్న , కార్యదర్శి శ్రీ మనోహర్, మాజీ సర్పంచ్ సదాశివ .భారత్ జాగృతి నియోజకవర్గ అధ్యక్షులుమక్కల సాయినాథ్ ఉపాధ్యక్షులు డాక్టర్ బాలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love