ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల గృహనిర్బంధం

నవతెలంగాణ – అమరావతి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంచుతున్నారు. పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని ఇళ్లలోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఏపీ వ్యాప్తంగా పలువురు పార్టీ నాయకుల ఇళ్ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కుప్పం ఇన్‌ఛార్జి మునిరత్నంను సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ శివకుమార్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే కుప్పం పట్టణంలో బంద్‌ వాతావరణం తలపిస్తోంది. విశాఖ డాక్టర్ కాలనీలోని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్‌, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేశరాు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారు.

Spread the love