భారీగా నగదు పట్టివేత

నవతెలంగాణ – నిజాంసాగర్
నిజం సాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వెహికల్ తనిఖీలు చేయగా రూ.5,45,000 దొరికాయని ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సమీర్ హుస్సేన్ సాబ్ కురేశి అను వ్యక్తి బొలెరో వాహనంలో హైదరాబాద్ నుండి నాందేడ్ వైపు నగదు తీసుకెళ్తుండగా నగదు దొరికిందని ఆయన తెలిపారు. ఎలాంటి పత్రాలు చూపెట్టకపోవడం వలన అట్టు నగదుని సీజ్ చేసామని ఆయన తెలిపారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కావున పెద్ద మొత్తంలో నగదును ఎవరు కూడా తీసుకెళ్లద్దని ఒకవేళ తీసుకెళ్తే అందుకు తగిన పత్రాలు చూపెట్టాలని ఆయన తెలిపారు.
Spread the love