మ‌రో మైలురాయిని చేరుకున్న హైద‌రాబాద్ మెట్రో

నవతెలంగాణ హైద‌రాబాద్: హైద‌రాబాద్ మెట్రో మ‌రో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్ర‌యాణికుల మైలురాయిని దాటింది. ఈ మేర‌కు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు. గ్రీన్ మైల్స్ లాయ‌ల్టీ క్ల‌బ్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. మెట్రోపై ప్ర‌యాణికుల‌కు న‌మ్మ‌కం పెరిగింద‌ని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు వ‌ల్ల 14.5 కోట్ల లీట‌ర్ల ఇంధ‌నం ఆదా అయింద‌న్నారు. రోజూ 5.5 ల‌క్ష‌ల మంది మెట్రోలో ప్ర‌యాణిస్తున్నారు. రెండో ద‌శ మెట్రో రైలుకు డీపీఆర్‌లు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Spread the love