హైదరాబాద్ : ఐడిబిఐ బ్యాంక్ తన అమృత్ మహోత్సవ్ ఎఫ్డి పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పండుగ ఆఫర్లను విస్తరిస్న్నుట్లు పేర్కొంది. ఈ పరిమిత కాల ప్రమోషన్లో 444 రోజుల కాలపరిమితి ఎఫ్డి ఎంపికతో ఏడాదికి 7.75 గరిష్ట వడ్డీ రేటును, 375 రోజుల ఎంపికతో ఏడాదికి 7.60 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్ను అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.