ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో వైద్య గర్జన ..

– తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ప్రభుత్వ డాక్టర్ ల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న  వైద్యుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ .డాక్టర్ బొంగు రమేష్ లు డిమాండ్ చేశారు. కోటి ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలోని అల్యూమిని ఆడిటోరియంలోశుక్రవారం డిఎం ఈ. టీవీ వీపి. డి పి హెచ్ . ఈఎస్ఐ ‌ వైద్యుల పెండింగ్ సమస్యలపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ…వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వైద్య విధాన పరిషత్ లో పనిచేసే వైద్యులను, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ కార్డులు లేకపోవడం దారుణం అని అన్నారు. మెడికల్ కళాశాలలో పనిచేసే వైద్యులకు 2016 పి.ఆర్సి ఏరియల్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గత ఆరు నెలలుగా పిఆర్సి ఏరియల్ చెల్లించకుండా ఫైల్ పెండింగ్లో పెట్టడం సబబు కాదని అన్నారు. రూరల్ మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన వైద్యులకు రూరల్ అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని చర్చలకు పిలిచి ప్రభుత్వ వైద్యుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. డాక్టర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని అన్నారు. డి.హెచ్ పరిధిలో టైం బౌండ్ ప్రమోషన్లను వెంటనే కల్పించాలని సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా వైద్య  ఆరోగ్యశాఖ అధికారులను 33 జిల్లాలకు తీసుకోవాలని,   ఎడిషనల్ డి.ఎం.హెచ్.ఓ పోస్టులను డి.ఎం.హెచ్.ఓ లుగా మార్చుతూ విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కు తీసుకోవాలని, వారి స్థానంలో సీనియారిటీ ప్రాతిపదికన నింపాలని డిమాండ్ చేశారు. ఎస్. పి. ఎం పూర్తి చేసిన వారికి ఆ పోస్టులు లేటరల్ ఎంట్రీ  ద్వారా ఇవ్వడానికి వీలు లేదని వారిని జిల్లాలలో ఉన్న డీ.ఎస్.ఓ (ఐ.డి.యస్.పి) లుగా నియమించాలని డిమాండ్ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
2016 పిఆర్సి వేతన బకాయిలు 2023 వరకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ మెడికల్ కళాశాలల్లో బోధన వైద్యులకు రూరల్ అలవెన్స్
మెడికల్ కళాశాలలో తగిన వసతులు కల్పించాలన్నారు. వైద్య విధాన పరిషత్ వైద్యులు కు వైద్య సిబ్బందికి 010 ద్వారా ట్రెజరీ జీతాలుఇవ్వాలని కోరారు.
 నూతన డి సి హెచ్ ఎస్ పోస్టులు 33 జిల్లాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  పరిధిలోని వైద్యులకు ప్రమోషన్లు కల్పించాలన్నారు.
 ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి డిసిగ్నేటెడ్ డిప్యూటీ సివిల్ సర్జన్, 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి డిసిగ్నేటెడ్ సివిల్ సర్జన్లుగా హోదా కల్పించి  అన్ని జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులర్ డిఎంహెచ్ ఓల నియామకం చేయాలని కోరారు.కొత్త గా నియామకం చేసిన ఐదు డి.ఎం.హెచ్.ఓ పోస్టులను జోనల్ పరిధిలో కాకుండా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంచాలని అన్నారు. వాటిని సీనియార్టీ ప్రకారం భర్తీ చేయాలి అన్నారు. వైద్యులకు  ప్రోటోకాల్ హోదా కల్పించాలని అన్నారు .ఆరోగ్య మహిళ చేస్తున్న మహిళా వైద్యులకు ప్రత్యేక గౌరవ పారితోషకం ఇవ్వాలన్నారు. పల్లె దవాఖాన , బస్తీ దవాఖానా మరియు కాంట్రాక్ట్ వైద్యులు కాంట్రాక్టు వైద్యులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్  చేయాలని కోరారు. పల్లె దవాఖానాలలో ఉన్న వైద్యుల కనీస జీతాన్ని 60 వేలు గా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ల పరిష్కారం కొరకు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని సంఘాలు కలిసి త్వరలో వైద్య గర్జన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రతినిధులు  డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ అజ్మీరా రంగ, డాక్టర్ ఉమా కాంత్ , డాక్టర్ రాజు, డాక్టర్ వినోద్ , డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శేఖర్, డాక్టర్  భూపేందర్ , డాక్టర్ రవి , డాక్టర్ రమేష్, డాక్టర్ అబ్బయ్య, డాక్టర్ వసంత్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రుక్మా రెడ్డి, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, డాక్టర్ ప్రతిభా లక్ష్మి, డాక్టర్ రవికుమార్ , డాక్టర్ జయశ్రీ, డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ లింగం గౌడ్, డాక్టర్ చింతమడక సాయిరాం, డాక్టర్ అంబి శ్రీనివాస్, డాక్టర్ అన్వేష్ డాక్టర్ అరవింద్, డాక్టర్ ముసిబా సల్మాన్, డాక్టర్ అయేషా, డాక్టర్ సుల్తానా, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కరుణాకర్, తదితరులు ఉన్నారు.
Spread the love