- Advertisement -
- ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు మహేశ్ విజ్ఞప్తి
- నవతెలంగాణ – బెజ్జంకి
- సాగు కాలం ప్రారంభమైన దృష్ట్యా రైతుల ప్రయోజనార్థం ఎరువుల దుకాణాల్లో నిల్వ ఉన్న విత్తనాలు,కీటక నాశిని రసాయనాలపై తక్షణమే క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి నాశిరకం వాటిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదివారం ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు దొంతరవేణి మహేశ్ సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.రైతుల అవసరాలను అసరాగా మలుచుకుని ఎరువుల దుకాణదారులు నాశిరకం విత్తనాలు,గడువు ముగిసిన రసాయనాలను నిర్దేశించిన ధరకంటే అదనంగా దోచుకుని కట్టబెట్టే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు మండల వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించి పారదర్శకంగా తనిఖీలు చేపట్టాలని మహేశ్ కోరారు.
- Advertisement -



