– రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి
నవతెలంగాణ- ఆలేరు రూరల్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో మాత పితృగో ఆశ్రమంలో మహా రుద్రయాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. వేద పండితులు సీతారామ శర్మ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు యాగం ప్రారంభించారు. వేద శాస్త్రి గోపూజ నంది మహానుమాలు రుద్రాభిషేకం నిర్వహించారు. రుద్రహోమం అనంతరం దంపతుల పూజ నిర్వహించారు. అనంతరం చీఫ్ సెక్రెటరీని గ్రామ కమిటీ తరపున సన్మానించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లేష్, నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.