పెరిగిన బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : మగువలకు బిగ్‌ షాక్‌.. బంగారం ధర.. భారీగా పెరిగింది. నిన్నపెరిగిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 72, 930 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 66, 850 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 500 తగ్గి రూ. 84, 500 గా నమోదు అయింది.అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 80 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Spread the love