చిన్న ఓదాల దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన

నవతెలంగాణ – మంథని: మంథని మండలం చిన్న ఓదాల గ్రామంలోని దేవాలయంలో సోమవారం జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంథని ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో మంథని నియోజక వర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ,ఎంపీపీ కొండ శంకర్,జెడ్పిటిసి తగరం సుమలత-శంకర్ లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ఎక్కేటి.అనంతరెడ్డి, రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్,స్థానిక సర్పంచ్,ఎంపిటిసి, నాయకులు,పాల్గొన్నారు.

Spread the love