ఉచిత సెల్ ఫోన్ రిపైర్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో సెల్ ఫోన్ రిపేర్ 30 రోజులు 08 నుండి ప్రారంభం, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ 30 రోజులు ఈ నేలా 12 నుండి ప్రారంభ మవుతున్నాయని సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉచిత శిక్షణ తో పాటుగా ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.శిక్షణా అనంతరం ధ్రువీకరణ పత్రం అందిస్తమని వివరించారు.శిక్షణకు కావాల్సిన అర్హతలు 19 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ చక్కని అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ తెలిపార . శిక్షణ కు వచ్చే వారు తమవేంట ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్, 10 వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు ఫోటోలు తమవేంట తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం ఎస్‌బి‌ఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్పూర్ రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 08461 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని కోరారు.

Spread the love