బహుజనులు రాజ్యాధికారం సాధించుకోవాలి..

– ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు సదన్ మహారాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
బహుజనులు రాజ్యాధికార సాధన కొరకు ధర్మ సమాజ్ పార్టీ నిరంతరం ముందుంటుందని ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు బోయిని సదన్ మహారాజ్ అన్నారు. బుధవారం హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండల ప్రతినిధుల సమావేశం లో ఇంటింటి ప్రచార కరపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని, అవన్నీ అగ్రకులాల నాయకత్వంలోనే జరిగాయని అందుకే రాజ్యాధికారం, సంపద చెక్కు చెదరకుండా వారి చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి పేదవాడు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో బతకడం ధర్మసమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. హుస్నాబాద్ మండల నాయకులు చెంచల ఎల్లన్న, ప్రవీణ్, వెంకటేశ్, రామకృష్ణ, వొద్దిరాల సతీష్, శంకర్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Spread the love