కోరిన వరాలు ఇచ్చే చల్లని తల్లి ఎల్లమ్మ

– నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
భక్తుల కొంగు బంగారం, కోరిన వరాలు ఇచ్చే చల్లని తల్లి హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి అని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువును సందర్శించి కట్ట సుందరికరణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, ఎంపీపీలు లకవత్ మానస సుభాష్, మాలోతు లక్ష్మి, బిల్లు నాయక్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love