ఉత్సాహంగా హుస్నాబాద్ లో 3 కే రన్..

– పరుగుల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
– పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుస్నాబాద్ లో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 కే రన్ నిర్వహించారు. 3 కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో గతంలో కూడా పరుగు పందాలు నిర్వహించారని అన్నారు. యువత, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రన్ ను విజయవంతంగా నిర్వహించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ లో ప్రగతి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ పరుగులో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఇంద్రనీల్ బాబు పాల్గొని యువతలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగాా మాట్లాడుతూూ పదేళ్లు సాధించిన ప్రగతి రన్ రూపంలో దూసుకుపోతుందన్నారు. దశాబ్దిలోనే శతాబ్దికి సరపడా సంక్షేమ పరుగు తెలంగాణ ఖ్యాతిని నూరేళ్ల పాటు శాశ్వతంగా నిలిచేలా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పరుగు ఇక ఎవరూ ఆపలేని పరుగు రోజురోజు వేగం పుంజుకుంటుందన్నారు. అనంతరం రన్నింగ్ లో రాణించిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్, ఎస్ ఐ మహేష్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత రెడ్డి, పిడి బూట్ల రాజ మల్లయ్య, కౌన్సిలర్ లు బోజు రమాదేవి రవీందర్, పెరుక భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. .

Spread the love