మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: జగన్నాథ్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్ 

మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని రాష్ట్ర పరిశీలకులు జగన్నాథ్ రెడ్డి అన్నారు. పట్టణం హౌసింగ్ బోర్డ్ లోని ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని  ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. ,ఈ కార్యక్రమం యొక్క వివరాలు మహిళలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రత్యేక మహిళా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర పరిశీలకులు  తెలియజేశారు,  122మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు 14 మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి ,డాక్టర్ మానసలు ,పరీక్షలు నిర్వహించడం జరిగింది,, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ పరిశీలించారు, యుపిఎస్సి సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య పర్యవేక్షకుడు చంద్రశేఖర్ ల్యాబ్ టెక్నీషియన్ చరణ్ ఇతరులు పాల్గొన్నారు.
Spread the love