వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణంలో నీ శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ప్రజా ఐక్య సర్వ సమాజ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో జెండా బాలాజీ జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు జెండా పంతులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా  సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ 100 సంవత్సరాలు నుంచి ఆనవాయితుగా ఆర్మూర్ లో జెండా జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జెండా బాలాజీ జాతర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన పోహార్ భరత్ రాజ్ కుటుంబ సభ్యులు సర్వసమాజ్ కు జెండా బట్టను అందించడం జరిగిందని అన్నారు. ఈనెల 19వ తేదీ నుంచి జెండా జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని అన్నారు. జెండా జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. సర్వ సమాజ్ కార్యదర్శి దినేష్, ఉపాధ్యక్షులు రవీందర్, సంయుక్త కార్యదర్శి రవి ప్రజా ఐక్య సర్వ సమాజ్  సభ్యులు పాల్గొన్నారు.
Spread the love