జగన్ బెయిల్ విచారణ 24న సుప్రీంలో విచారణ

నవతెలంగాణ – ఢిల్లీ: సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌.. సుప్రీంకోర్టులో ఈ నెల 24న విచారణకు రానుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్‌ చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ సవాలు చేశారు.

Spread the love