బీఎస్పీ పార్టీకి చెందిన జక్కని సంజయ్ క్షమాపణ చెప్పాలి

– బీఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్ అన్నారు

నవతెలంగాణ -శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల అధ్యక్షుడు గంట మైపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న బిఆర్ఎస్ యువగర్జన లో దళితులను అవమానపరిచారని బీఎస్పీ పార్టీకి చెందిన జక్కని సంజయ్ కుమార్,మా పార్టీ పైన బురద జల్లడం సరైంది కాదని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక బీఎస్పీ, కాంగ్రెస్, పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 2024 మూడోసారి ముచ్చటగా రసమయి గెలుపొందడం  ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జక్కని సంజయ్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెపుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికోట రమేష్, చౌడమల వీరస్వామి, సర్పంచులు, కలువల భద్రయ్య, కొండ్ర  రాజయ్య, మాతంగి లక్ష్మయ్య, బొజ్జ సుధాకర్, బొజ్జ రవి, మెరుగు శ్రీనివాస్, అంతడుపుల సతీష్, క్యాదాసి భాస్కర్, మేకల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love